Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకను చంపేందుకు వచ్చిన సింహాన్ని అడ్డుకున్న యువకుడ్ని పొట్టనబెట్టుకుంది

Webdunia
శనివారం, 8 మే 2021 (15:54 IST)
గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని మధుపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తన మామిడి తోటలో మేకలను పెంచుతున్న 35 ఏళ్ల వ్యక్తిని సింహం చంపేసింది.
 
వివరాలు చూస్తే.. జిల్లాలోని మధుపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 35 ఏళ్ల వ్యక్తిని సింహం చంపినట్లు అటవీ అధికారి తెలిపారు. తెల్లవారుజామున 1 గంటకు గిర్ (పశ్చిమ) అటవీ విభాగంలో తలాలా శ్రేణిలో ఈ సంఘటన జరిగిందని జునాగఢ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్), దుష్యంత్ తెలిపారు.
 
బాధితుడు బహదూర్భాయ్ జీవాభాయ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. తన మేకను సింహం నుండి కాపాడటానికి ప్రయత్నించే క్రమంలో అతడు బలయ్యాడు. ఈ సంఘటన తరువాత, సింహాన్ని అటవీ శాఖ సిబ్బంది బృందం పట్టుకున్నట్లు అధికారి తెలిపారు.
 
"జివాభాయ్ మధుపూర్ గ్రామంలోని మామిడి తోట వద్ద ఒక గుడిసె బయట నిద్రిస్తున్నాడు, అక్కడ సింహం చెట్టుకు కట్టేసి వున్న మేకపై దాడి చేయడానికి ప్రయత్నించింది. జివాభాయ్ మేక అరుపులు విని సింహాన్ని చూసాడు. మేకను కాపాడేందుకు సింహం పైకి వెళ్లాడు. అయితే ఆ క్రూర జంతువు అతన్ని చంపేసింది" అని దుష్యంత్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments