Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకను చంపేందుకు వచ్చిన సింహాన్ని అడ్డుకున్న యువకుడ్ని పొట్టనబెట్టుకుంది

Webdunia
శనివారం, 8 మే 2021 (15:54 IST)
గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని మధుపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తన మామిడి తోటలో మేకలను పెంచుతున్న 35 ఏళ్ల వ్యక్తిని సింహం చంపేసింది.
 
వివరాలు చూస్తే.. జిల్లాలోని మధుపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 35 ఏళ్ల వ్యక్తిని సింహం చంపినట్లు అటవీ అధికారి తెలిపారు. తెల్లవారుజామున 1 గంటకు గిర్ (పశ్చిమ) అటవీ విభాగంలో తలాలా శ్రేణిలో ఈ సంఘటన జరిగిందని జునాగఢ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్), దుష్యంత్ తెలిపారు.
 
బాధితుడు బహదూర్భాయ్ జీవాభాయ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. తన మేకను సింహం నుండి కాపాడటానికి ప్రయత్నించే క్రమంలో అతడు బలయ్యాడు. ఈ సంఘటన తరువాత, సింహాన్ని అటవీ శాఖ సిబ్బంది బృందం పట్టుకున్నట్లు అధికారి తెలిపారు.
 
"జివాభాయ్ మధుపూర్ గ్రామంలోని మామిడి తోట వద్ద ఒక గుడిసె బయట నిద్రిస్తున్నాడు, అక్కడ సింహం చెట్టుకు కట్టేసి వున్న మేకపై దాడి చేయడానికి ప్రయత్నించింది. జివాభాయ్ మేక అరుపులు విని సింహాన్ని చూసాడు. మేకను కాపాడేందుకు సింహం పైకి వెళ్లాడు. అయితే ఆ క్రూర జంతువు అతన్ని చంపేసింది" అని దుష్యంత్ చెప్పారు.

సంబంధిత వార్తలు

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments