Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోటు కాదు దోరగా వేయించిన దోశె.. నెటిజన్స్ కామెంట్స్

భారత రిజర్వు బ్యాంకు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త రూ.200, రూ.50 కరెన్సీ నోట్లను శుక్రవారం నుంచి చెలామణిలోకి తెచ్చింది. కొత్త రూ.200 రూపాయాల నోటు కోసం ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు ఖాతా

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (16:29 IST)
భారత రిజర్వు బ్యాంకు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త రూ.200, రూ.50 కరెన్సీ నోట్లను శుక్రవారం నుంచి చెలామణిలోకి తెచ్చింది. కొత్త రూ.200 రూపాయాల నోటు కోసం ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు ఖాతాదారులు క్యూ కట్టారు. కొత్త నోటును చేజిక్కించుకునేందుకు పోటీ పడ్డారు. రూ.50, రూ.200 నోట్ల కోసం ఎగబడ్డారు. రూ.200 రూపాయల డినామినేషన్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది తొలిసారి. అయితే కొత్త నోట్లు ఏటీఎంల ద్వారా చలామణిలోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది.
 
అయితే, ఈ నోటు రంగుపై నెటిజన్లు పలు రకాలైన కామెంట్స్ చేస్తున్నారు. కాషాయ రంగులో ఉన్న ఈ నోటు దోరగా వేయించిన దోశను తలపిస్తుందని, బాగా మరగబెట్టిన ఇరానీ చాయ్ రంగులో ఉందని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నోటును వినాయక చవితి రోజు విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందుత్వాన్ని చూపిస్తుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికి వరకు విడుదల చేసిన రూ.2000, రూ.500, రూ.200, రూ.50 నోట్లన్నీ అమ్మాయిలకు బాగా ఇష్టమైన రంగుల్లోనే ఉన్నాయన్నారు. మరి అబ్బాయిలకోసం నోట్లు ప్రచురించరా? అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments