Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త: ఐఎంపీఎస్ గరిష్ట పరిమితి పెంపు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (16:13 IST)
పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త వినిపించింది. ఆన్ లైన్ చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని పెంచింది. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు ఉండేది. తాజాగా.. దీనిని రూ. 5లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సాహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు. 
 
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఐఎంపీఎస్ బ్యాంకుల లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు క్షణాల్లో డబ్బులు పంపించేందుకు దీనిని ఉపయోగిస్తుంటారు. 2010లో తొలిసారిగా దీనిని ప్రారంభించారు. 24 గంటల పాటు ఈ సేవలు పని చేస్తాయి. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ పరిమితిని పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments