Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త: ఐఎంపీఎస్ గరిష్ట పరిమితి పెంపు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (16:13 IST)
పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త వినిపించింది. ఆన్ లైన్ చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని పెంచింది. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు ఉండేది. తాజాగా.. దీనిని రూ. 5లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సాహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు. 
 
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఐఎంపీఎస్ బ్యాంకుల లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు క్షణాల్లో డబ్బులు పంపించేందుకు దీనిని ఉపయోగిస్తుంటారు. 2010లో తొలిసారిగా దీనిని ప్రారంభించారు. 24 గంటల పాటు ఈ సేవలు పని చేస్తాయి. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ పరిమితిని పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments