Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ : ఇకపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు బాదుడు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (09:44 IST)
బ్యాంకు ఖాతాదారులకు భారత రిజర్వు బ్యాంకు తేరుకోలేని షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ నిర్ణయంతో కస్టమర్లకు షాకిచ్చినట్లయింది. 
 
ఆర్బీఐ ఏటీఎం ఇంటర్‌ఛేంజ్‌ చార్జీలను పెంచుకోవచ్చని బ్యాంకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో బ్యాంకు ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌పై రూ.17 వరకు చార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఫీజు ఇదివరకు రూ.15గా ఉండేది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఈ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది. 
 
మీ బ్రాంచ్‌ ఏటీఎం కాకుండా మరో బ్యాంకు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటే.. అప్పుడు మీ బ్యాంకు .. ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దీన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు. అంతేకాకుండా ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత బ్యాంకు కస్టమర్లు ఏటీఎంల నుంచి లావాదేవిలు నిర్వహిస్తే అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో లావాదేవిపై రూ.21 వరకు వసూలు వసూలు చేయవచ్చు. 
 
ఈ చార్జీ ప్రస్తుతం 20 రూపాయలుగా ఉంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments