Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట రైళ్లల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టలేం..!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (21:52 IST)
రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంది. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్‌లలో ఛార్జింగ్‌ పాయింట్లను ఇకపై ఉపయోగించలేరని వెల్లడించింది. 
 
అగ్ని ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాత్రి సమయంలో ఛార్జింగ్‌ పాయింట్ల వాడకంపై నిషేధం విధించింది. ఇటీవల ఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక కోచ్‌లో మొదలైన మంటలు ఏడు బోగీలకు వ్యాపించాయి.
 
ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వే నిర్ణయించినట్లు వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. 
 
ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు రాత్రిపూట ఛార్జింగ్‌ పెట్టే క్రమంలో కొన్నిసార్లు అవి వేడెక్కడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మంటలు సంభవిస్తున్నాయి. దీంతో ఇతర రైల్వే జోన్లలో కూడా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఠాకూర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments