Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా రద్దీ : ప్రత్యేకం పేరుతో భారీ వడ్డన - రైల్వే మాయ

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (07:52 IST)
రైల్వే శాఖ ప్రయాణికులపై అమితంగా భారీ మోపుతోంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకం పేరుతో భారీగా ప్రయాణ చార్జీలను వసూలుకు శ్రీకారం చుట్టుంది. ప్రత్యేక రైళ్లు, తత్కాల్ పేరుతో ప్రయాణికులు భరించలేనంతగా చార్జీలు వసూలు చేస్తోంది. 
 
రైల్వే తాజా నిర్ణయంతో రైలు, ప్రయాణం చేసే క్లాస్‌ను బట్టి ఒక్కో ప్రయాణికుడిపై అదనంగా రూ.200 నుంచి రూ.700 వరకు భారం పడుతోంది. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. 
 
దీంతో అనూహ్యంగా పెరిగిన రద్దీని తట్టుకునేందుకు రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ రైళ్ల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న హైదరాబాద్ - విశాఖపట్టణం గరీభ్‌ రథ్ రైలు టికెట్లన్నీ కొన్ని గంటల్లోనే అమ్ముడుపోగా, 142 మంది ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అదే రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు 16 రైళ్లు వెళ్లనుండగా రెండు, మూడు మినహా అన్నింటిలోనూ టికెట్లు అయిపోయాయి. ఈ రైళ్లలో టిక్కెట్లన్నీ ప్రత్యేకం పేరుతో భారీ ధరకు అమ్ముకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments