Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త యేడాదిలో మోత మోగనున్న కార్ల ధరలు...

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:39 IST)
కొత్త సంవత్సరంలోకి మరో తొమ్మిది రోజుల్లో అడుగుపెట్టనున్నాం. ఈ కొత్త యేడాదిలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు.. కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోనున్నాయి. దీనికి కారణం ఉక్కు, ప్లాస్టిక్, ఇతర నిర్మాణ వ్యయాలు పెరగడంతో తయారీ కంపెనీలు వీటి ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఇప్పటికే మహీంద్రా, రెనో, హీరో మోటోకార్ప్, మారుతిసుజుకి, ఫోర్డ్ వంటి వాహన తయారీ సంస్థలు జనవరి 1 నుంచి తమ వాహన మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు బీఎండబ్ల్యూ, టాటా మోటార్స్, ఇసుజు సంస్థలు కూడా వాణిజ్యపరమైన వాహనాల ధరలు పెంచాలని నిర్ణయించుకున్నాయి.
 
ఉత్పత్తి వ్యయం అధికం కావడమే కాకుండా, బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు తయారు చేయాల్సిరావడం ఆర్థికంగా ప్రయాసభరితమని టాటా మోటార్స్ వెల్లడించింది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ జనవరి 4 నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. 
 
బీఎండబ్ల్యూతో పాటు అనుబంధ బ్రాండ్లపై 2 శాతం పెంపు ఉంటుందని తెలిపింది. పికప్ వాహనాలకు పెట్టింది పేరైన ఇసుజు సంస్థ మోడళ్లను బట్టి రూ.10 వేల మేర ధరల పెంచాలని నిర్ణయించింది. ఇసుజు ధరల పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments