Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన కర్ణాటక పోలింగ్... మళ్లీ మొదలైన పెట్రో బాదుడు.. ఒకేసారి...

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:36 IST)
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును ఒకేసారి బాదేశాయి. కర్ణాటక పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. ఆదివారం రాత్రి నుంచి ధరలు పెరగటం మొదలుపెట్టాయి.
 
పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.79.25, డీజిల్ రూ.71.90పైసలకు చేరుకుంది. ఆయా ప్రాంతాలను బట్టి 2, 3 పైసలు అటూ ఇటుగా ఈ ధర ఉంది. ప్రస్తుత ధరల పెంపుదల చూస్తుంటే.. మరో 48 గంటల్లోనే లీటర్ పెట్రోల్ రూ.80 చేరుకున్నా పెద్దగా ఆశ్చరపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
పైగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. తగ్గుదల ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments