Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (07:38 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల బాదుడును చమురు కంపెనీలు ఆపడం లేదు. ఫలితంగా వీటి ధరలు జెట్ స్పీడ్ వేగంతో దూసుకునిపోతున్నాయి. గత 15 రోజుల్లో 13 సార్లు ధరలను పెంచేశాయి. మంగళవారం కూడా మరోమారు రేట్లు పెంచాయి. లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఈ తాజా ధరల పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.104.61గా ఉండగా, డీజిల్ ధర రూ.95.87కు చేరుకుంది. అలాగే ముంబైలో లీటరు పెట్రోల్ రూ.119.67గాను, డీజిల్ ధర రూ.103.92గా పలుకుతుండగా, హైదరాబాద్ నగరంలో ఇది రూ.118.59, 104.62గా వుంది. 
 
గత 13 రోజుల్లో మొత్తం 11 రూపాయల మేరకు ధరలను పెంచింది. ఈ పెరుగుదల ప్రతి ఒక్క నిత్యావసర సరకుల ధరలపై ప్రభావం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు కూడా భారీగా పెరగడమే ప్రధాన కారణం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments