Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆగని పెట్రోల్ - డీజిల్ ధరల బాదుడు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (08:38 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడును ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏమాత్రం ఆపడం లేదు. ఏమాత్రం విరామం ఇవ్వకుండా వీటి ధరలను పెంచేస్తున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ ధర బాదుడు వల్ల ప్రజలతో మోయలేని భారం పడుతున్నప్పటికీ చమురు కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
గత నెల 22వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ బాదుడు ఏకధాటిగా కొనసాగుతోంది. ఆదివారం పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెంచిన చమురు కంపెనీలు సోమవారం పెట్రోల్‌పై మరో 40 పైసలు వడ్డించాయి. దీంతో 14 రోజుల వ్యవధిలో ఇంధర ధరల పెరగడం ఇది 12వ సారి. మొత్తం లీటరు పెట్రోల్‌పై రూ.9.44పైసలు, డిజిల్‌పై రూ.9.10 పైసలు చొప్పున వడ్డించాయి. 
 
తాజాగా పెంచిన ధరతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ ధర రూ.95.07కు చేరుకున్నయి. అలాగే, హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.117.68కి, డిజిల్ ధర రూ.103.75కి చేరుకున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments