Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరకు రెక్కలు... కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి... కేజీ ధర రూ.80

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:29 IST)
ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. ఉల్లి కొనాలంటేనే జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రెండు వారాల పాటు ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేజీ ఉల్లిపాయలు రూ.50 పలుకుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కేజీ 80 రూపాయల మేర పలుకుతోంది. ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్రను వరదలు ముంచెత్తడంతో.. ఉల్లి ఉత్పత్తికి కళ్లెం పడింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. 
 
పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాల్లో నిల్వ ఉన్న ఉల్లిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ప్రభుత్వం కోరింది. అలాగే, కనీస ఎగుమతి ధరను పెంచి, ప్రోత్సాహకాలు ఉపసంహరించడం ద్వారా ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది. 
 
నిత్యం ఆహారంలో ఉపయోగించే ఉల్లి ధరలు పెరగడంపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం