Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ 2021 : ముఖేష్ అంబానీ టాప్ - ఆదానీ సంపద 49 శాతం పెరుగుదల

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:58 IST)
ఫోర్బ్స్‌‌ 2021 రిచ్‌‌లిస్ట్‌‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ బాస్‌‌ ముకేశ్‌‌ అంబానీ మళ్లీ టాప్‌లో నిలిచారు. 2008 నుంచి ఆయన నెంబర్‌‌ వన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈయన మొత్తం సంపద 92.7 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్‌‌ ప్రకటించింది. 
 
రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ తాజాగా రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఫోర్బ్స్‌‌ రిచ్‌‌లిస్ట్‌‌లోని టాప్ 100 మంది సంపద 775 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్‌‌ ఇండియా ప్రకటించింది.
 
గత యేడాదితో పోల్చితే 257 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలిపింది. సుమారు 61 మంది బిలియనీర్లు తమ సంపదకు కనీసం ఒక బిలియన్ డాలర్లను యాడ్‌‌ చేసుకోగలిగారని ఫోర్బ్స్‌‌ పేర్కొంది. రిచ్‌‌లిస్ట్‌‌లోని 80 శాతం మంది సంపద పెరిగిందని తెలిపింది. గత ఏడాది కాలంలో అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది.
 
ఈ రిచ్‌‌లిస్టులో రెండో స్థానంలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద 74.8 బిలియన్‌‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది కాలంలో ఫోర్బ్స్ రిచ్‌‌ లిస్టులోని ఇతర బిలియనీర్ల కంటే అదానీ సంపద 200 శాతం పెరిగింది. అంటే ఆయన సంపద ఒక్క ఏడాదిలోనే 49.5 బిలియన్ డాలర్లు ఎగిసింది. ముఖ్యంగా, ఈయన సంపద భారత్‌లో కరోనా కష్టకాలంలోనే పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments