Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 రిలీజ్ - టాప్-10 కుబేరుల్లో అంబానీ

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (12:46 IST)
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన పారిశ్రామివేత్తగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోమారు నిలిచారు. 8100 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నామొన్నటివరకు ఉన్న అదానీ గ్రూపు కంపెనీ అధిపతి గౌతం అదానీ ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. తాజాగా ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 
 
టాప్-10 జాబితాలో ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పైగా, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ముఖేష్ అంబానీ కావడం గమనార్హం. అంబానీ నికర సంపద 82 బిలియన్ డాలర్లుగా హురున్ పేర్కొన్నారు. నిజానికి గత యేడాదితో పోలిస్తే అంబానీ సంపద 20 అంటే 21 బిలియన్ డాలర్లు తగ్గింది. 
 
మరోవైపు అదానీ సంపద భారీగా క్షీణించింది. దీంతో అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ ఇపుడు భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచారు. కాగా, గతంలో హిండెన్‌బర్గ్ వెలువరించిన నివేదిక ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అదానీ అస్తులు మంచు గడ్డల్లా కరిగిపోయాయి. ఏకంగా 140 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments