Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ఔషధాల రేట్లు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (12:07 IST)
ఏప్రిల్‌ 1 నుంచి ఔషధాల రేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగించే వాటితో పాటు మొత్తం 850 రకాల షెడ్యూల్‌ మందుల ధరలు పెరగబోతున్నాయి. 
 
జ్వరం, బీపీ తదితర సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే దాదాపు 850 షెడ్యూల్‌ మందుల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి. దీంతో పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌తో సహా పలు అత్యవసర మందుల ధరలు పెరిగిపోనున్నాయి. 
 
జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గుండెజబ్బులు, రక్తపోటు (బీపీ), చర్మవ్యాధులు, రక్తహీనత తదితరాల చికిత్సలో వినియోగించే పారాసెట్‌మాల్‌, అజిత్రోమైసిన్‌, ఫెనోబార్బిటోన్‌, ఫెనిటోయిన్‌ సోడియం, సిప్రోఫ్లోక్సాసిన్‌ హైడ్రోక్లోరైడ్‌, మెట్రోనిడాజోల్‌ వంటి మందులు ఈ జాబితాలో ఉన్నాయి.
 
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020తో పోలిస్తే 2021 సంవత్సరానికి గాను మందుల టోకు ధరల సూచీ 10.76 శాతం పెరిగినట్లు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments