Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలక్ట్రిక్ కార్ల విఫణిలోకి మారుతి సుజుకి - ఒక్కసారి చార్జింగ్ చేస్తే...

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:21 IST)
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి ఇపుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. తాజాగా మరో కార్ల తయారీ కంపెనీ టయోటాతో కలిసి అత్యాధునిక సౌకర్యాలతో ఓ కారును తయారు చేసింది. ఈ కారుకు ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసేలా కారును డిజైన్ చేశారు. 
 
దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈ తరహా కార్లను తయారు చేస్తున్నాయి. అలాగే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా కానుండటంతో మారుతి సుజుకి కూడా ఈ తరహా కార్ల తయారీపై దృష్టిసారించింది. 
 
ఇందులోభాగంగా ఎంతో ఆకర్షణీయమైన డిజైన్‌తో తాజాగా తయారు చేసిన కారును పరిశీలిస్తే, ఇప్పటివరకు దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్ల కంటే అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కారును విదేశాలకు సైతం ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఈ కారును డిజైన్ చేసినట్టు ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 
 
48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే ఈ కారును ఒకసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. అదేవిధంగా 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే కారుకు చార్జింగ్ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలను గుజరాత్ రాష్ట్రంలో తయారు చేస్తుంది. ఇవి డీడీఎస్జీ లిథియం అయాన్ బ్యాటరీలు. ఈ బ్యాటరీలను కారులో వినియోగించనున్నారు. ఈ కారు ధర మార్కెట్‌లో రూ.13 నుంచి రూ.15 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments