Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామపై ఎస్సీఎస్టీ కేసు - ఫిర్యాదుదారునికి నోటీసులు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:02 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ పోలీసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసుపై హైకోర్టుపై స్టే విధించింది. అదేసమయంలో ఈ కేసులో ఫిర్యాదుదారునికి నోటిసులు పంపాలని ఆదేశించింది. ఎస్సీలను రఘురామరాజు కులం పేరుతో దూషించారంటూ వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
అయితే, ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ బంధువు తనపై ఈ కేసు పెట్టారంటూ హైకోర్టుకు రఘురామకృష్ణం రాజు తీసుకెళ్ళారు. ముఖ్యంగా, రఘురామరాజు ఎలాంటి దూషణలకు పాల్పడకపోయినప్పటికీ కేసు నమోదు చేశారని రఘురామ తరపు న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. 
 
ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కాగా గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందిన రఘురామ ఇపుడు ఆ పార్టీ రెబెల్ ఎంపీగా చెలామణి అవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments