వాణిజ్య సిలిండర్ ధరపై బాదుడు.. మార్చి ఒకటో తేదీ నుంచి అమలు!

ఠాగూర్
శుక్రవారం, 1 మార్చి 2024 (11:08 IST)
దేశంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోమారు పెంచాయి. ధరల సవరణ చర్యల్లో భాగంగా, మార్చి ఒకటో తేదీ శుక్రవారం చమురు కంపెనీలు ఈ పెరిగిన ధరలను వెల్లడించాయి. ఈ ప్రకారంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేరకు పెరిగింది. ఈ పెరిగిన ధరలు దేశ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులపై పడుతుంది. తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రిటైల్ ధర రూ.1795కు చేరింది. 
 
అలాగే, ఇతర ప్రధాన నగరాలైన కోల్‌కతాలో రూ.1911, ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1960.50కు చేరింది. అయితే, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపనీలు వెల్లడించాయి. మరోవైపు, విమానం ఇంధన ధరలను కూడా కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో కిలోలీటర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధర రూ.624.37కు చేరిందని చమురు కంపెనీలు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments