Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరగనున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (13:15 IST)
కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం సబ్సిడీని భారీగా తగ్గిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్రోలియం సబ్సిడీకి కేటాయింపుల్ని మూడింట రెండొంతులు తగ్గించింది. గతంలో పెట్రోలియం సబ్సిడీ రూ.40,915 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం రూ.12,995 కోట్లు మాత్రమే కేటాయించింది. ఓవైపు ఉజ్వల స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే కోటి మంది లబ్ధిదారులు ఉన్నారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో కోత విధిస్తోంది. దీంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెరిగే అవకాశముంది. సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల్ని తగ్గిస్తోంది. ఒకేసారి కాకుండా దశలవారీగా సబ్సిడీని తగ్గించనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో కిరోసిన్, వంట గ్యాస్ ధరలు కూడా దశలవారీగా పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. 
 
అలాగే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ.125 పెరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో రెండు సార్లు రూ.50 చొప్పున, ఫిబ్రవరిలో రూ.25 సిలిండర్ ధర పెరిగింది. సామాన్యులకు మూడు నెలల్లో గ్యాస్ సిలిండర్ మరింత భారమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments