Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం పరిమితి.. యేడాదికి 15 మాత్రమే!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:34 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రతి కుటుంబానికి కేంద్రం అందజేసే సిలిండర్ల సంఖ్యను 15కే పరిమితం చేయనుంది. ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు అయినా వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ, ఇకపై ఒక కుటుంబానికి 15 సిలిండర్లకు మంచి ఇవ్వరు. ఒకవేళ అదనపు సిలిండర్లు కావాలంటే తగిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.

మీడియాలో వస్తున్న కథనాల మేరకు ఒక కుటుంబం ఒక సంవత్సరానికి గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే పొందగలుగుతుంది. నెలకు 2కు మించి సిలిండర్లు పొందలేరు. కానీ, ఇప్పటివరుక ఎల్పీజీ సిలిండర్లపై ఎలాంటి కోటా లేకపోలు. ఒకవేళ ఎవరికైన ఒక నెలలో రెండు సిండర్లు కావాలంటే ఆ అవసరానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.

ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన వంట గ్యాస్ ధరలతో సామాన్య ప్రజానీకం అల్లాడిపోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో 58 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ అధికారిక డేటా ప్రకారం 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2022 జూలై 6వ తేదీ వరకు గ్యాస్ సిలిండర్ ధర 45 శాతం మేరకు పెరిగింది.

2017 ఏప్రిల్ నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.723గా ఉండగా అది ఇపుడు రూ.1053కు పెరిగింది. ఈ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments