ఎల్ఐసీ హెచ్చరిక.. మోసగాళ్ల నుంచి జాగ్రత్త..

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (11:44 IST)
LIC
ప్రముఖ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ వస్తుంది. ఇటీవల వినియోగదారులకు సోషల్ మీడియా ద్వారా ప్రతి చిన్న అప్ డేట్ అందిస్తున్న సంస్థ.. తాజాగా ప్రజలను హెచ్చరించింది. 
 
కంపెనీ లోగోను ఎవరు కూడా ఉపయోగించవద్దని సూచించింది. కంపెనీ అనుమతి లేకుండా.. లోగో ఉపయోగించడం శిక్షార్హమని తెలిపింది. ఇలా చేస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
 
ఏ వెబ్‌సైట్ కానీ లేదంటే ఇతరులు, వ్యాపారులు ఇలా ఎవ్వరూ కూడా కంపెనీ అనుమతి లేనిదే ఎల్‌ఐసీ లోగో ఉపయోగించకూడదని తెలిపింది. అలా చేసినవారికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా.. మరో విషయంపై కూడా కస్టమర్లను ఎల్ఐసీ అలర్ట్ చేసింది. 
 
మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలిని కోరింది. ఎల్ఐసీ అధికారులు ఫోన్ కాల్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ వివరాలు అడగరు అని స్పష్టం చేసింది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. 
 
ఏదైనా అనుమానిత కాల్స్ లేదా అనుమానాస్పద మెయిల్స్ వస్తే.. spuriouscalls@licindia.comకు తెలియజేయాలని తెలిపింది. కంపెనీ కాల్ సెంటర్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచింది. 022-6827 6827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. సందేహాలను పరిష్కరించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments