Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసీ తొలి పబ్లిక్ ఇష్యూ - సరికొత్త రికార్డులు

Webdunia
బుధవారం, 4 మే 2022 (12:54 IST)
భారతీయ బీమా సంస్థ ఎల్.ఐ.సి తొలి పబ్లిక్ ఇష్యూ ఆఫర్ బుధవారం ప్రారంభమైంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది చరిత్రపుటలకెక్కింది. ఈ పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేందుకు ఎంతో మంది పెట్టుబడిదారులు అమితాసక్తిని చూపుతున్నారు. ఫలితంగా ఐపీఓ ఆరంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5620 కోట్ల నిధులను ఎల్ఐసీ సేకరించింది. ఈ ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిలోని 3.5 శాతాను ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తుంది. తద్వారా రూ.20,557 కోట్ల నిధులను సమీకరించుకోనుంది. 
 
ఇష్యూ ఆరంభమైన మొదటి రెండు గంటల్లోనే (మధ్యాహ్నం 12 గంటలకు) పాలసీదారులకు కేటాయించిన కోటా మేరకు పూర్తి బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోటాలో 48 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 31 శాతానికి సమానమైన బిడ్లు వచ్చాయి. మొత్తం మీద 28 శాతం ఇష్యూకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. 
 
మొత్తం 22.13 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయిస్తోంది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. పాలసీదారుల కోటా కింద 10 శాతం రిజర్వ్ చేశారు. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.902-949. ఒక లాట్ కింద కనీసం 15 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాలసీదారులకు ఇష్యూ ధరపై రూ.60 డిస్కౌంట్, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఇష్యూ ఈ నెల 9న ముగియనుంది. 17న స్టాక్ ఎక్సేంజ్‌లలో ఎల్ఐసీ లిస్ట్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments