Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసీ తొలి పబ్లిక్ ఇష్యూ - సరికొత్త రికార్డులు

Webdunia
బుధవారం, 4 మే 2022 (12:54 IST)
భారతీయ బీమా సంస్థ ఎల్.ఐ.సి తొలి పబ్లిక్ ఇష్యూ ఆఫర్ బుధవారం ప్రారంభమైంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది చరిత్రపుటలకెక్కింది. ఈ పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేందుకు ఎంతో మంది పెట్టుబడిదారులు అమితాసక్తిని చూపుతున్నారు. ఫలితంగా ఐపీఓ ఆరంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5620 కోట్ల నిధులను ఎల్ఐసీ సేకరించింది. ఈ ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిలోని 3.5 శాతాను ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తుంది. తద్వారా రూ.20,557 కోట్ల నిధులను సమీకరించుకోనుంది. 
 
ఇష్యూ ఆరంభమైన మొదటి రెండు గంటల్లోనే (మధ్యాహ్నం 12 గంటలకు) పాలసీదారులకు కేటాయించిన కోటా మేరకు పూర్తి బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోటాలో 48 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 31 శాతానికి సమానమైన బిడ్లు వచ్చాయి. మొత్తం మీద 28 శాతం ఇష్యూకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. 
 
మొత్తం 22.13 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయిస్తోంది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. పాలసీదారుల కోటా కింద 10 శాతం రిజర్వ్ చేశారు. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.902-949. ఒక లాట్ కింద కనీసం 15 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాలసీదారులకు ఇష్యూ ధరపై రూ.60 డిస్కౌంట్, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఇష్యూ ఈ నెల 9న ముగియనుంది. 17న స్టాక్ ఎక్సేంజ్‌లలో ఎల్ఐసీ లిస్ట్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments