Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా అండతో రెచ్చిపోయిన ఇరాన్ - రైలు ప్రాజెక్టు తప్పించిన భారత్‌

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (18:54 IST)
చైనాతో అండతో ఇరాన్ రెచ్చిపోయింది. రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌‌ను తప్పించింది. భారత్‌కు అతిపెద్ద దౌత్యపరమైన దెబ్బ తీసింది. భారత్ - చైనా మధ్య కొనసాగుతున్న గొడవల మధ్య ఇరాన్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్ చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించింది. గత నాలుగేళ్ళ తర్వాత కూడా ఈ ప్రాజెక్టుకు భారతదేశం నిధులు ఇవ్వడం లేనందునే తామే ఈ ప్రాజెక్టును స్వయంగా పూర్తి చేసుకుంటామని ఇరాన్ చెప్తున్నది. 
 
ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చాలా పెద్దదిగా భావిస్తున్నారు. చాబహర్ ఓడరేవు నుంచి జహేదాన్ మధ్య చాబహర్ రైలు ప్రాజెక్టును నిర్మించాల్సి ఉన్నది. 628 కిలోమీటర్ల పొడవైన ఈ ట్రాక్ నిర్మాణాన్ని గత వారం ఇరాన్ రవాణా మంత్రి మొహమ్మద్ ఇస్లామి ప్రారంభించారు. 
 
ఇరాన్ తన రైల్వే మార్గాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లోని జరంజ్ సరిహద్దు వరకు విస్తరించాలని కోరుకుంటున్నది. దీనికోసం చాబహర్ రైలు ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ చాబహర్ రైలు ప్రాజెక్టును భారత ప్రభుత్వ రైల్వే సంస్థ ఇర్కాన్ పూర్తి చేయాల్సి ఉన్నది. 
 
భారత్, ఆఫ్ఘనిస్తాన్‌లో సహా ఇతర మధ్య ఆసియా దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించతలపెట్టారు. ఈ కారణంగా ఇరాన్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇరాన్ పర్యటన సందర్భంగా 2016 లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ చాబహర్ ఒప్పందంపై సంతకం చేశారు. 
 
ఈ మొత్తం ప్రాజెక్టుపై సుమారు 6 1.6 బిలియన్లు పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారతదేశం నుంచి ఇంజనీర్లు కూడా ఇరాన్‌కు వెళ్లారు. అయితే, అమెరికా ఆంక్షల భయంతో భారత్ రైలు ప్రాజెక్టు పనులను ప్రారంభించలేదు. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మధ్య.. ఇరాన్‌ను నియంత్రించడానికి చైనా ప్రయత్నించింది. 
 
ఈ సిరీస్‌లో ఇరాన్‌తో చైనా ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకోబోతున్నది. దీని కింద ఇరాన్ నుంచి చమురును చాలా తక్కువ ధరకు చైనా కొనుగోలు చేస్తుంది. బదులుగా ఇరాన్‌లో 400 బిలియన్ డాలర్లు పెట్టుబడులను చైనా ప్రభుత్వం పెట్టడానికి అంగీకరించింది. అంతేకాకుండా, ఇరాన్‌కు అత్యాధునిక ఆయుధాలను అందివ్వడంలో కూడా చైనా సహాయపడనున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments