Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ఏటీఎంను ముట్టుకోకుండానే డబ్బులు తీసుకోవాలంటే?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (12:31 IST)
ATM
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో వస్తువులను ముట్టుకునేందుకు జనం జంకుతున్నారు. ముఖ్యంగా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి మిషన్‌ను తాకడానికి చాలామంది భయపడిపోతున్నారు. ఎవరెవరో ముట్టుకోవడం వల్ల వైరస్ సోకే అవకాశం ఉందని చాలామంది వెనకా ముందు ఆలోచిస్తున్నారు. 
 
అయితే ఇక నుంచి ఏటీఎం మిషన్‌ను ఏ మాత్రం చేతితో ముట్టుకోకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో కంటే సులువుగా కూడా పని పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది.
 
దీని కోసం ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కొత్త రకం మిషన్లను అభివృద్ధి చేస్తున్నాయి. వాటిలో ఉండే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే డబ్బులు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. దీని ద్వారా కార్డ్ క్లోనింగ్ అవుతుందన్న భయం కూడా ఉండదు. 
 
అత్యంత సురక్షితమైన మార్గం కావడంతో ఈ విధానం తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 25 సెకన్లలోనే డబ్బులు చేతికి వచ్చేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇవి కనుక వస్తే రాబోయే రోజుల్లో ఏటీఎంలలో ఇంకా సులువుగా డబ్బులు తీసుకునే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments