వస్త్రాలపై జీఎస్టీ పెంపు ఇప్పట్లో లేనట్టే... వెనక్కి తగ్గిన కేంద్రం

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (15:46 IST)
వస్త్రాలపై వసూలు చేస్తున్న జీఎస్టీ పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం భావించింది. దీనిపై శుక్రవారం జరిగిన 46వ జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే, వస్త్రాలపై జీఎస్టీని 12 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో జీఎస్టీ కౌన్సిల్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం వాయిదాపడింది. దీంతో ప్రస్తుతం వసూలు చేస్తున్న 5 శాతం జీఎస్టీనే వసూలు చేయనున్నారు. 
 
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. ఇందులో వస్త్రాలపై వసూలు చేస్తున్న 5 శాతం జీఎస్టీని 2022 నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి 12 శాతం పెంచాలని భావించింది. అయితే, దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 
 
వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం పెంచితే పేదలకు వస్త్రాలు భారంగా మారతాయని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) నిబంధనల అమలు భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమైంది. ప్రధానంగా గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వస్త్రాలపై జీఎస్టీ పెంపు అంశంపై ప్రధాన అజెండాగా మారినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సమావేశం వాయిదాపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments