Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు - తెలుగు రాష్ట్రాల్లో భారీ వృద్ధి

Webdunia
మంగళవారం, 2 మే 2023 (09:12 IST)
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. గత 2022 ఏప్రిల్ నెలతో పోల్చితే, 2023 ఏప్రిల్ నెలలో ఈ పన్నుల వసూళ్లు ఏకంగా 12 శాతం పెరిగాయి. అలాగే గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా ఈ పన్ను వసూళ్లు నమోదైనట్టు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలైనట్టు తెలిపింది. గత యేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 12 శాతం అంటే రూ.19495 కోట్ల మేరకు పెరిగాయి. గత యేడాది ఏప్రిల్ నెలలో రూ.1.68 కోట్లు వసూలు అయ్యాయి. 
 
కాగా, ఈ యేడాది జనవరి నెల నుంచి ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు 10 శాతానికి పైగా పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా ఆదాయం గత యేడాది ఇదే నెలతో పోల్చితే ఈ ఏప్రిల్ నెలలో 16 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.
 
ఇకపోతే, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత యేడాది ఏప్రిల్ నెలలో రూ.4067 కోట్లు వసూళ్లు సాధించగా, ఏపీలో ఈ సారి ఆరు శాతం పెరుగుదలతో రూ.4329 కోట్లు నమోదు చేసింది. అదేవిధంగా తెలంగాణాలో జీఎస్టీ వసూళ్లు రూ.4955 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.5622 కోట్లుగా నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments