ఈ యేడాది భారీగా పెరిగిన ముఖేశ్ అంబానీ సంపద... మొత్తం ఆస్తి విలువ రూ.9.68 లక్షల కోట్లు!!

ఠాగూర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:26 IST)
రిలయన్స్ అధినేత ముఖేషశ్ అంబానీ ఆస్తులు ఈ యేడాది మరింతగా పెరిగాయి. దీంతో భారతదేశంలోనే అత్యంత సంపన్నడుగా నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఆయన భారత్‌లోని కోటీశ్వరుల్లో మొదటిస్థానంలో నిలించారు. అలాగే, ఆసియాలోనూ ఆయన అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం ముఖేశ్ అంబానీ సంపద విలువ రూ.9.68 లక్షల కోట్లుగా ఉందన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. గత యేడాది ఆయన ఆస్తి విలువ రూ.6.92 లక్షల కోట్లుగా ఉండగా, ఈ యేడాదికి అది మరింతగా పెరిగింది. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. 
 
భారత్‌లో ముఖేశ్ అంబానీ తర్వాత స్థానాల్లో అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ రూ.7 లక్షల ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. అలాగే, హెచ్.సి.ఎల్ అధినేత శివనాడార్ రూ.3 లక్షల కోట్లు, సావిత్రి జిందాల్ రూ.2.79 కోట్లు, దిలీప్ సంఘ్వి రూ.2.22 లక్షల కోట్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలించారు. కాగా, భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య బాగా పెరిగిందని, ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2023లో భారత్‌లో ఈ బిలియనీర్ల సంఖ్య 169గా ఉండగా, ఇపుడు అది 200కు పెరిగినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments