Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముకేశ్ అంబానీ తనయుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం రూ.200 కోట్లు ఖర్చు

ananth ambani

ఠాగూర్

, మంగళవారం, 5 మార్చి 2024 (14:23 IST)
దేశ పారిశ్రామికదిగ్గజం, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‌లో ఈ వేడుకలను కన్నులపండుగగా నిర్వహించారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్రపరిశ్రమతో పాటు పలువురు సినీ సెలెబ్రిటీలు, దేశ విదేశీ క్రికెటర్లు, ఐటీ కంపెనీల యజమానులు, దేశ పారిశ్రామిక వేత్తలు  ఇలా అన్ని రంగాల వారు తరలివచ్చారు. 
 
ఈ వేడుకకు వచ్చిన  అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగ్‌లు వేయించి మరీ ఈ వేడుకను నిర్వహించారు. అన్నదానంతో మొదలైన వేడుకలకు హస్తాక్షర్‌తో ముగింపు పలికారు. అయితే, ఈ వేడుక కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
 
మూడు రోజుల ఈ వేడుకలో భోజనాల ఖర్చే రూ.200 కోట్ల పైచిలుకు అని తెలిసింది. అతిథులకు వందలాది రుచులను పరిచయం చేస్తూ సిద్ధం చేసిన మెనూకు అంబానీ భారీ మొత్తం వెచ్చించారట. ఇక ఈ వేడుకలో రెండు గంటలపాటు ఆడిపాడినందుకు పాప్ సింగర్ రిహానాకు ఏకంగా రూ.52 కోట్లు చెల్లించారట. 
 
సినిమా సెట్టింగ్‌లను తలపించేలా వేసిన సెట్టింగులు, అతిథుల కోసం ఫైవ్ స్టార్ హోటల్‌ను మరిపించేలా చేసిన ఏర్పాట్లకు.. మొత్తంగా కలిపి ఈ వేడుకకు ముఖేశ్ అంబానీ అక్షరాలా రూ.1260 కోట్ల నుంచి రూ.1300 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, వాస్తవంలో మాత్రం ఈ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 10న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల