Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-కామర్స్ సంస్థలకు ఊరట.. కానీ అమేజాన్‌కు తప్పని నష్టాలు

Webdunia
శనివారం, 2 మే 2020 (17:16 IST)
దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల అనగా మే 17 వరకు లాక్ డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఊరట లభించింది. మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించాయి. అయితే రెడ్ జోన్లలో మాత్రం ఈ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే డెలివరీ చేయగలవు. 
 
తాజాగా మూడో దశ లాక్ డౌన్‌కు కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే ప్రజలకు ఈ కామర్స్ సంస్థలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేయవచ్చు.  
 
ఇకపోతే.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్ వల్లే తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని అమేజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ వెల్లడించారు. భారత్‌లో నిత్యావసరాల డెలివరీకి మాత్రమే ఈ-కామర్స్ సంస్థలకు అనుమతులున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ త్రైమాసికంలోనే తొలిసారి అమేజాన్‌కు నష్టాలొచ్చాయని ఓస్లాస్కీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments