Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-కామర్స్ సంస్థలకు ఊరట.. కానీ అమేజాన్‌కు తప్పని నష్టాలు

Webdunia
శనివారం, 2 మే 2020 (17:16 IST)
దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల అనగా మే 17 వరకు లాక్ డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఊరట లభించింది. మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించాయి. అయితే రెడ్ జోన్లలో మాత్రం ఈ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే డెలివరీ చేయగలవు. 
 
తాజాగా మూడో దశ లాక్ డౌన్‌కు కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే ప్రజలకు ఈ కామర్స్ సంస్థలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేయవచ్చు.  
 
ఇకపోతే.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్ వల్లే తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని అమేజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ వెల్లడించారు. భారత్‌లో నిత్యావసరాల డెలివరీకి మాత్రమే ఈ-కామర్స్ సంస్థలకు అనుమతులున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ త్రైమాసికంలోనే తొలిసారి అమేజాన్‌కు నష్టాలొచ్చాయని ఓస్లాస్కీ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments