Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు... త్వరలో రూ.70 వేలకు చేరే ఛాన్స్..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (10:28 IST)
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేలు దాటిపోయింది. గడిచిన 10 రోజుల్లోనే 10 గ్రాముల బంగారు ధర దాదాపు రూ.5 వేలు పుంజుకుంది. మున్ముందు ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గతవారం భువనేశ్వర్‌లో రూ.57,620గా ఉన్న బంగారం ధర ఇపుడు రూ.61,400కు చేరింది. దీంతో ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ధర రూ.70 వేలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆభరణాల తయారీ కోసం వినియోగించే బంగారం ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. 
 
ఈ నెల 9వ తేదీన 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర భువనేశ్వర్‌లో రూ.50,500గా ఉంది. ఇపుడు ఈ ధర రూ.55,400కు చేరుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ బంగారం ధరలు ఒక్క భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments