Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు... త్వరలో రూ.70 వేలకు చేరే ఛాన్స్..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (10:28 IST)
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేలు దాటిపోయింది. గడిచిన 10 రోజుల్లోనే 10 గ్రాముల బంగారు ధర దాదాపు రూ.5 వేలు పుంజుకుంది. మున్ముందు ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గతవారం భువనేశ్వర్‌లో రూ.57,620గా ఉన్న బంగారం ధర ఇపుడు రూ.61,400కు చేరింది. దీంతో ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ధర రూ.70 వేలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆభరణాల తయారీ కోసం వినియోగించే బంగారం ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. 
 
ఈ నెల 9వ తేదీన 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర భువనేశ్వర్‌లో రూ.50,500గా ఉంది. ఇపుడు ఈ ధర రూ.55,400కు చేరుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ బంగారం ధరలు ఒక్క భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments