Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటి నుంచి రైల్వే స్టేషన్లలో కొత్త నిబంధనలు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (17:03 IST)
దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల మేరకు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాంలపై అన్ని అమ్మకాలకు క్యాష్‌లెస్ చెల్లింపులు మాత్రమే జరపాలన్న నిర్బంధ నిబంధనను ప్రవేశపెట్టనుంది. అలాగే, ప్రతి వస్తువును ఎమ్మార్పీ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ఈ కఠిన నింబధనలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి విధిగా అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. 
 
రైల్వే బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్‌తో పాటు అన్ని స్టాల్స్‌లో నగదు స్వీకరించేందుకు వీలుండదు. అన్నింటినీ డిజిటల్ పద్దతిలోనే విక్రయిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం రూ.10 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ, స్వైపింగ్ మెషీన్లను షాపు యజమానులు కలిగివుండాలని రైల్వే బోర్డు ఆదేశించింది. అంతేకాకుండా, ప్రతి విక్రయానికి తప్పకుండా కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలన్న నిబంధన కూడా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments