Webdunia - Bharat's app for daily news and videos

Install App

54 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న బీఎస్ఎన్ఎల్

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (21:11 IST)
భారత ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ బోర్డు 54 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఖర్చులను తగ్గించుకునే క్రమంలో రిటైర్మెంట్ వయస్సును 58 సంవత్సరాలకు తగ్గించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం పది ప్రతిపాదనలను సూచించగా అందులో మూడింటికి బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.
 
తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తొలిసారి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు జీతాల కోసం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల అప్పు కూడా చేయాల్సి వచ్చింది. దీంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన రూ.2900 కోట్లు చెల్లించడంతో పాటు ప్రభుత్వం మరో రూ.3500 కోట్ల రుణం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇచ్చింది. 
 
ఈ డబ్బుతో మరో మూడు, నాలుగు నెలల వరకు బీఎస్‌ఎన్‌ఎల్ తన కార్యకలాపాలను కొనసాగించే వీలు కలిగింది. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థలో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఎవరి ఉద్యోగం ఉంటుందో లేక ఊడుతుందోనని ఉద్యోగులు కంగారుపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

మిరాయ్ సినిమాలో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటున్న మంచు మనోజ్

కిష్కింధపురి జెన్యూన్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

KH 237: కమల్ హాసన్ 237 చిత్రం అన్బరివ్ దర్శకత్వంలో ప్రారంభం

Anuksha: అనుష్క శెట్టి సోషల్ మీడియాకూ దూరం, ఘాటీ చిత్రం రిజల్ట్ కారణమా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments