Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేలో నూతన శకం : మేకిన్ ఇండియా రైలు.. గంటకు 180 కిమీ స్పీడ్

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (10:31 IST)
భారతీయ రైల్వే శాఖలో నూతనశకం ఆరంభమైంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశీయంగా అత్యంత వేగంతో నడిచే రైలును తయారు చేశారు. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. పైగా, దేశంలో అత్యంత వేగంతో నడిచే తొలి రైలుగా ఇది గుర్తింపుపొందింది. 
 
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రైలు టెస్టింగ్ రన్ ఆదివారం జరిగింది. దీన్ని గంటకు 180 కిలోమీటర్ల వేగంగా నడుపగా, ఈ ట్రయల్ రన్ విజయవంతమైంది. కోట - సవాయ్ మధోపూర్ రైల్వే సెక్షన్‌లో ఈ ట్రయల్ టెస్ట్ నిర్వహించగా, ఇది గంటకు 180 కిమీ వేగాన్ని అందుకుంది. ఈ రైలును రూ.100 కోట్ల వ్యయంతో తయారు చేశారు. 
 
ఇప్పటికే ఈ ట్రైన్‌కు సంబంధించి ప్రధాన ట్రయల్ రన్స్ పూర్తయ్యాయని.. ఈ ట్రైన్‌ను తయారు చేసిన ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ జీఎం ఎస్.మణి తెలిపారు. అధికారులు, నిపుణుల రిపోర్ట్ ప్రకారం ట్రైన్‌కు తుది మెరుగులు దిద్దుతామన్న ఆయన ట్రయల్ రన్స్‌లో ఎలాంటి భారీ సాంకేతిక సమస్యలు తలెత్తలేదని చెప్పారు. రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ సాధారణంగా మూడు నెలలు జరుగుతుందని అయితే ఈ ట్రైన్‌కు సంబంధించి అన్నీ త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments