Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు కేంద్రం శుభవార్త... రెండో దశ నగదు జమకు శ్రీకారం

Webdunia
ఆదివారం, 3 మే 2020 (18:04 IST)
దేశంలోని పేదలకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి రెండో దఫా నగదు జమకు శ్రీకారం చుట్టింది. ఈ నగదును సోమవారం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. 
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ సమయంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు నగదు జన్‌ధన్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా ఏప్రిల్ నెలలో తొలి దఫా నగదును డిపాజిట్ చేసింది. రెండో దశ నగదు జమను మే నెలలో శ్రీకారం చుట్టింది. ఈ నగదును సోమవారం నుంచి డ‌బ్బుల‌ను తీసుకోవ‌చ్చ‌ని సూచించింది. 
 
ఈ నెల 4వ తేదీ నుంచి 11 వ‌ర‌కు అకౌంట్ నెంబ‌ర్ల‌లోని చివరి సంఖ్య‌ల ఆధారంగా చెప్పిన రోజుల్లో బ్యాంకుకు వెళ్లి, లేదా ఏటీఎం, ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు. 11వ తేదీ త‌ర్వాత జ‌న్‌ధన్ మ‌హిళ‌ల‌ అంద‌రి అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ కానున్నాయి. 
 
జ‌మ అయిన‌ డ‌బ్బులు ఎక్క‌డికి పోవ‌ని, నిధానంగా తీసుకోవాల‌ని ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి. అయితే, బ్యాంకులకు వచ్చి తీసుకునే ఖాతాదారులు మాత్రం విధిగా సామాజిక భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని బ్యాంకులు స్పష్టం చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments