Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ సిటీ, చిలమథుర్‌లో తమ గ్రామీణ శాఖను ప్రారంభించిన యాక్సిస్‌ బ్యాంక్‌

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (19:56 IST)
భారతదేశంలో మూడవ అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఒకటైన యాక్సిస్‌ బ్యాంక్‌ తమ గ్రామీణ బ్యాంక్‌ శాఖను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ, చిలమథుర్‌ వద్ద ప్రారంభించింది. ఈ శాఖను ముఖ్య అతిథులుగా విచ్చేసిన కస్టమ్స్‌ స్పెసిఫైడ్‌ ఆఫీసర్‌ శ్రీ మధుబాబు, శ్రీ సిటీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ శ్రీ నాగరాజన్‌; శ్రీ సిటీ బిజినెస్‌ హెడ్‌ శ్రీ రాకేష్‌ ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధులు శ్రీ నూతి చక్రవర్తి, రీజనల్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌-సౌత్‌ 2; శ్రీ ఎం హరనాథ్‌, సర్కిల్‌ హెడ్‌, ఆంధ్ర; శ్రీ ఎం వెంకట్‌ సుబ్రమణ్యం, క్లస్టర్‌ హెడ్‌, నెల్లూరు, శ్రీ నటువ బ్రమర్‌నాథ్‌, ఎల్‌ఎస్‌ క్లస్టర్‌ హెడ్‌, నెల్లూరు పాల్గొన్నారు. ఈ నూతన శాఖ గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఆర్కెడ్‌ బిల్డింగ్‌, శ్రీ సిటీ ట్రేడ్‌ సెంటర్‌ ఎదురుగా, చిలమథుర్‌, ఆంధ్రప్రదేశ్‌ వద్ద ఉంది. అన్ని రకాల సాధారణ బ్యాంక్‌ సేవలనూ ఇక్కడ అందించనున్నారు.
 
ఈ సందర్భంగా యాక్సిస్‌ బ్యాంక్‌ భారత్‌ బ్యాంకింగ్‌ హెడ్‌- గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ మునీష్‌ షార్దా మాట్లాడుతూ, ‘‘గ్రామీణ మరియు పట్టణ మార్కెట్‌లు యాక్సిస్‌ బ్యాంక్‌ దృష్టి సారించిన అతి కీలకమైన మార్కెట్‌లు. ఈ నూతన శాఖతో విస్తృత శ్రేణి బ్యాకింగ్‌ సేవలను ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అందించనున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments