Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటి నుంచి పట్టాలెక్కనున్న రెగ్యులర్ రైళ్లు...

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (11:13 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత రైల్వే శాఖ అన్ని రకాల రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. ఆ తర్వాత దశలవారీగా పట్టాలెక్కిస్తోంది. ఈ క్రమంలో రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కించబోతోంది. వీటిలో 22 రైళ్లను (11 జతలు) పునరుద్ధరించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది.
 
వీటిలో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, ఔరంగాబాద్, రేణిగుంట నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ శాతం ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. మిగిలినవి తొలి వారంలో అందుబాటులోకి వస్తాయి. 
 
కొత్తగా అందుబాటులోకి రానున్న రైళ్లలో 8 డైలీ సర్వీసులు కాగా, వారానికి మూడు రోజులు నడిచేవి రెండు ఉన్నాయి. మిగిలిన 12 రైళ్లు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తాయి. ఈ రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ-సికింద్రాబాద్ (02799), సికింద్రాబాద్-విజయవాడ (02800), గుంటూరు-కాచిగూడ (07251), కాచిగూడ-గుంటూరు(07252), సికింద్రాబాద్-విశాఖపట్టణం (02739), విశాఖపట్టణం-సికింద్రాబాద్ (02740), ఆదిలాబాద్-నాందేడ్ (07409), నాందేడ్-ఆదిలాబాద్ (07410) రైళ్లు ప్రతి రోజూ నడవనుండగా, మిగతా రైళ్లలో వారానికి ఒకసారి, మూడుసార్లు నడిచేవి ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments