పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఈ నెల 4వ తేదీన సిలిండర్పై రూ.25 పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15వ తేదీన మరో రూ.50 పెరిగింది. మూడుసార్లు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంలో ఈ నెలలో మొత్తం రూ.100 పెరిగినట్లయింది.
ఇదిలావుంటే, ఈమధ్యకాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు వరసగా పెరిగిపోతుండడంతో వాహనదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. వరసగా రెండో రోజు ప్రభుత్వ చమురు సంస్థలు ధరలను పెంచలేదు.