Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కొత్తగా రెండు ఓడరేవులు.. జల మార్గాల ద్వారా ఖర్చు తక్కువ

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రెండు ఓడరేవులను ఏర్పాటు చేయాలని ఏపీ ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియాను కోరారు.

భారతదేశంలో అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో ఏపీ ఒకటి. ఏపీకి 972 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీరరేఖ ఉంది. గుజరాత్ 1061 కిలోమీటర్ల తర్వాత దేశంలో ఎక్కువ తీర రేఖ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. అయితే సరుకు రవాణాకు ఓడల ద్వారా ఖర్చు తక్కువ అవుతోంది.
 
అదే విమాన రవాణా - రైల్ రవాణాతో ఖర్చు అధికంగా అవుతుంది. ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్న ఏపీకి మరో రెండు మూడు ఓడరేవులు వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ సర్కారు అభిప్రాయపడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి గౌతంరెడ్డి అందజేశారు. 
 
దీంతో దుగరాజపట్నం పోర్టును జాతీయ పోర్టుగా చేయనందున-ప్రత్యామ్నాయంగా రామాయపట్నం - మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో కొత్త ఓడరేవులను ఏర్పాటు చేయాలని మాండవియాకి గౌతం రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఏపీ సముద్ర రవాణాలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments