Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.800, రూ.900 నాణేలను ఎపుడైనా చూశారా?

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (10:51 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.1, 2, 5, 10, 20 నాణేలు రోజువారీ చెలామణిలో ఉన్నాయి. కానీ, రూ.800, రూ.900 నాణేలను మీరు ఎక్కడా చూసివుండరు. ఎందుకంటే ఇవి దేశంలో ఎక్కడా చెలామణిలో లేవు. అయితే, ఈ నాణేలు ఎందుకు ముద్రించారన్నదే కదా మీ సందేహం. 
 
సాధారణంగా పలువురు ప్రముఖుల స్మృతి చిహ్నంగా ఆర్.బి.ఐ చాలా కొద్ది సంఖ్యలో ఇలాంటి నాణేలను ముద్రిస్తుంటుంది. ఇలా ముద్రించిన నాణేలను ప్రత్యేకంగా అమ్మకానికి పెడుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ రూ.800, రూ.900 నాణేలను తెప్పించుకున్నాడు. 
 
దేశంలో తొలిసారి విడుదలైన ఈ నాణేలను 2025, ఫిబ్రవరి 20వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న వాయిస్ తక్షణం ఆర్డర్ చేయగా, మార్చి 10వ తేదీన అందాయని వెల్లడించారు. 
 
ఈ నాణేలను జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతి సందర్భంగా ఆర్.బి.ఐ ముంబై మింట్ ముద్రించింది. వెండితో తయారు చేసిన ఈ నాణేలు ఒక్కోటి 40 గ్రాముల బరువును కలిగివుంది. కాగా, కరెన్సీ సేకరించే హాబీ ఉన్న మహ్మద్ వాయిస్ వద్ద 170 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments