Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.800, రూ.900 నాణేలను ఎపుడైనా చూశారా?

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (10:51 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.1, 2, 5, 10, 20 నాణేలు రోజువారీ చెలామణిలో ఉన్నాయి. కానీ, రూ.800, రూ.900 నాణేలను మీరు ఎక్కడా చూసివుండరు. ఎందుకంటే ఇవి దేశంలో ఎక్కడా చెలామణిలో లేవు. అయితే, ఈ నాణేలు ఎందుకు ముద్రించారన్నదే కదా మీ సందేహం. 
 
సాధారణంగా పలువురు ప్రముఖుల స్మృతి చిహ్నంగా ఆర్.బి.ఐ చాలా కొద్ది సంఖ్యలో ఇలాంటి నాణేలను ముద్రిస్తుంటుంది. ఇలా ముద్రించిన నాణేలను ప్రత్యేకంగా అమ్మకానికి పెడుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ రూ.800, రూ.900 నాణేలను తెప్పించుకున్నాడు. 
 
దేశంలో తొలిసారి విడుదలైన ఈ నాణేలను 2025, ఫిబ్రవరి 20వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న వాయిస్ తక్షణం ఆర్డర్ చేయగా, మార్చి 10వ తేదీన అందాయని వెల్లడించారు. 
 
ఈ నాణేలను జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతి సందర్భంగా ఆర్.బి.ఐ ముంబై మింట్ ముద్రించింది. వెండితో తయారు చేసిన ఈ నాణేలు ఒక్కోటి 40 గ్రాముల బరువును కలిగివుంది. కాగా, కరెన్సీ సేకరించే హాబీ ఉన్న మహ్మద్ వాయిస్ వద్ద 170 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments