రైల్వే ప్రయాణీకులకు చేదు వార్త.. దుప్పట్లు, బెడ్‌షీట్లు కావాలంటే?

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:02 IST)
రైల్వే ప్రయాణీకులకు చేదు వార్త. ఇకపై రైలులో దుప్పట్లు, బెడ్‌షీట్స్‌ కావాలంటే జేబులకు చిల్లు పెట్టుకోవాలసిందేనట. కోవిడ్‌‌కి ముందు రైల్వే శాఖ బెడ్‌ షీట్స్‌, దుప్పట్లు, దిండులను ఉచితంగానే ఇచ్చేది. అయితే కరోనా వైరస్‌ మొదటి వేవ్‌ ప్రారంభం నుంచి ఇవ్వడం నిలిపివేశారు. మహమ్మారి ఉదృతి తగ్గడంతో మళ్లీ ఆ సౌకర్యాన్ని షురూ చేసింది. 
 
అయితే ప్రస్తుతం ఢిల్లీతో సహా పలు రైల్వే డివిజన్ల రైళ్లలో డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు, దుప్పట్లు వంటి అవసరమైన కిట్‌లను ప్రయాణీకులకు అందించేందుకు స్టేషన్లలో అల్ట్రా-వైలెట్‌ బేస్డ్‌ లగేజ్‌ శానిటైజేషన్‌ మెషిన్లను ప్రారంభించింది. ఇందుకోసం రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణీకుడు కనిష్టంగా రూ. 30 నుంచి గరిష్టంగా రూ. 300 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
 
ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 95 శాతం రైళ్లు నడుస్తు న్నాయి. కాగా, ప్రస్తుతం ఢిల్లీ రైల్వే డివిజన్‌లో 57 రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కోవిడ్‌ పరిస్థితిని సమీక్షించిన తర్వాత మరిన్ని స్టేషన్లలో ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments