మెడభాగం నల్లగా ఉందా..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:15 IST)
అందంగా, మృదువుగా కనిపించే మెడభాగాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మెడమీది చర్మం సున్నితంగా ఉంటుంది.. కాబట్టి మృదువుగా శుభ్రం చేయాలి. జుట్టు నుండి మెడకు అంటుకునే జిడ్డును తొలగించేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
 
ఎండల్లో తిరిగినప్పుడు ఇంటికి రాగానే వేన్నీళ్లతో మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. కవరింగ్ నగలు ధరించటంవలన నల్లని మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మచ్చలు కారణంగా చర్మదురదలు కూడా వస్తాయి. కాబట్టి కవరింగ్ నగలను ధరించకపోవడమే ఉత్తమం.
 
మెడభాగానికి ఆలివ్ నూనె రాసి మసాజ్ చేయడం వలన ఆ ప్రాంతమంతా నున్నగా, మృదువుగా ఉంటుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా ఆలివ్ నూనెను రాసుకుని ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
రోజుకు కనీసం రెండుసార్లు 5 నిమిషాలపాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పడం చేయాలి. ఇలా చేయడం వలన మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొద్దిగా గ్లిజరిన్‌ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పడుకునేటపుడు మెడకు రాసి, ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మెడ మెరిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా పేరు మార్చే అంశాన్ని పరిశీలిస్తాం : కేటీఆర్

ఏపీ ఐటీ రంగంలో కీలక పరిణామం - వైజాగ్‌లో ఐబీఎం సేవలు

రక్షణ కల్పించాలంటే పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిని పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

తర్వాతి కథనం
Show comments