Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి...?

Advertiesment
gramflour
, సోమవారం, 18 మార్చి 2019 (12:03 IST)
మనిషిని చూడగానే ఆకట్టుకునేది ముఖమే. అలాంటి ముఖచర్మం అందంగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు బ్యూటీ నిపుణులు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఈ కింది చిట్కాలు ఎంతగానో సహాయపడుతాయి. మరి అవేంటో చూద్దాం..
 
1. శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖ చర్మంపై టాన్‌పోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
2. ఉల్లిరసంలో స్పూన్ ముల్తానీమట్టి, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దాంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
 
3. నిమ్మరసంలో ఆల్మండ్ ఆయిల్, సముద్రపు ఉప్పును కలిపి అందులో దూదిని ముంచి ముఖంపై గుండ్రంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మంపై మృతకణాలు పోతాయి. దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
4. టమోటాలోని యాంటీఆక్సిడెంట్స్ గుణాలు ముడతల చర్మాన్ని తొలగిస్తాయి. రెండుపెద్ద టమోటాలను మెత్తటి గుజ్జులా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు పడవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒత్తిడికి కారణాలేంటి?