Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (23:25 IST)
శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. కొందరికి పగుళ్లు కూడా వస్తాయి. ఇలాంటి వారు చర్మ రక్షణకు విటమిన్ సి లేదా ఇ కలిగిన లోషన్‌లు రాసుకోవాలి. ఆయిలీ స్కిన్ వున్నవాళ్లు కొంచెం తేనె, పెరుగు, దోసకాయ, కమలాపండు రసం మిశ్రమం చేసుకుని ముఖానికి పట్టించుకుని అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
పొడి చర్మం ఉన్నవారు అరటిపండు, తేనె, పాలు కలిపి రాసుకుంటే చర్మంలో మార్పు వస్తుంది. చర్మం పొడిబారినట్టుగా, ఉంటే పాలలో దూదిని ముంచి, ముఖమంతా రాసి, తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు ఈ విధంగా చేయవచ్చు. దీని వల్ల చర్మం పొడిబారదు. మృతకణాలు తొలగిపోతాయి.
 
చర్మం పొడిబారి, తెల్లగా ఉంటే ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి రోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. టీ స్పూన్ వెన్నలో చిటికెడు పసుపు వేసి కలిపి, ముఖానికి చేతులకు పట్టించి పది నిమిషాలుండాలి. తర్వాత వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే చర్మం మృదుత్వం కోల్పోదు. అరటిపండు గుజ్జు, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. తర్వాత వేళ్లతో రెండు నిమిషాలు మర్ధనా చేస్తూ మెత్తటి కాటన్ టవల్‌తో ముఖమంతా అద్దాలి. చలికాలంలో రోజూ ఈ విధంగా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments