Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గుజ్జులో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చాలామందికి చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెసరపిండిలో కొద్దిగా తేనె, పచ్చిపాలను కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (18:06 IST)
చాలామందికి చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెసరపిండిలో కొద్దిగా తేనె, పచ్చిపాలను కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది.
 
బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు, తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. బంతిపువ్వుల రేకులను ఎండబెట్టుకుని వాటిని పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 
 
కీరదోసను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే ఈ శీతాకాలంలో మంచిది. ప్రతిరోజూ నాలుగైదు లీటర్ల నీళ్లను తీసుకుంటే చర్మం సహజసిద్ధంగా ఉంటుంది. రాత్రి సమయంలో శరీరానికి నూనె రాసుకుని ఉదయాన్నే స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments