Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు, కలబంద గుజ్జుతో చర్మం మృదువుగా.. ఎలా?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (13:30 IST)
ముఖంపై మెుటిమలు తొలగించుకోవడానికి రకరకాల క్రీములు, మందులు వాడుతుంటారు. మరి వాటిని వాడితో కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతుంటారు. ఈ క్రీములు వాడడానికి బదులుగా ఇంట్లోని పదార్థాలు ఉపయోగించే మెుటిమలు నుండి ఉపశమనం లభిస్తుంది. అవేంటో పరిశీలిద్దాం..
 
వంటసోడా ఎప్పుడు ఇంట్లో ఉండేదే కాబట్టి.. వంటసోడాతో ప్యాక్ ఎలా వేయాలో చూద్దాం.. వంటసోడాలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా వారాంలో రెండుసార్లు చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
ఈ మెుటిమల కారణంగా ముఖంపై నల్లని నల్లని మచ్చలు వస్తుంటాయి. వాటిని ఎలా తొలగించాలంటే.. క్యారెట్‌‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే.. నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. 
 
కొందరికి వయసు తేడా లేకుండా ముఖం ముడతలుగా మారిపోతుంది. అలాంటప్పుడు.. పాలలో కొద్దిగా కలబంద గుజ్జు, కాకరకాయ రసం, పెరుగు వేసి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే ముడతల చర్మం తొలగిపోతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments