Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు సెమీస్‌లో చోటు ఖాయం... ఓడితే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (16:07 IST)
ఇప్పటివరకూ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఐదింటిలో గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు కాగా, మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉంది.
 
బంగ్లాతో మ్యాచ్‌లో ఓడినా, భారత్‌కు సెమీస్ అవకాశాలుంటాయి. ఈ నెల 6న శ్రీలంక‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, నాకౌట్స్ చేరుకోవచ్చు. ఒక వేళ అది కూడా ఓడినా, నెట్ రన్ రేట్‌ను మెరుగ్గా కొనసాగించుకుంటే, భారత్ సెమీస్‌కు అర్హత సాధించవచ్చు.
 
మరో వైపు బంగ్లా‌దేశ్‌కు ఇది చావో రేవో మ్యాచ్. 11 పాయింట్లతో టేబుల్‌లో ఆ జట్టు ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌తో పాటు పాకిస్తాన్‌తో ఓ మ్యాచ్‌ను ఆ జట్టు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిచినా, ఆ జట్టు సెమీస్ అవకాశాలు మిగతా జట్ల ఫలితాలపైనే ఆధారపడి ఉంటాయి.
 
భారత జట్టులో గాయపడ్డ విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ చేరాడు. గత మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు అవకాశం దక్కింది. నేటి మ్యాచ్‌‌లో ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. తుది-11 ఎవరనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments