Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల: పెళ్లయిన కూతుర్ని హతమార్చిన తండ్రి

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (11:44 IST)
నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో పరువు హత్య కలకలం రేపింది. పెళ్లయిన కూతుర్ని కన్న తండ్రే కడతేర్చారు. ప్రసన్న(21)కు రెండు సంవత్సరాల క్రితం బనగానపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం అయింది. అయితే, కొన్ని రోజుల కిందట ప్రసన్న ఆలమూరులో తండ్రి దేవేందర్ రెడ్డి వద్దకు వచ్చారు. తరువాత, అదే గ్రామానికి చెందిన ప్రియుడితో పరారయ్యారు. అనంతరం, పెద్దలు పెద్దమనుషులతో పంచాయతీ నిర్వహించి ఎవరి ఇంటికి వారిని పంపేశారు.
 
ఇకనైనా భర్త దగ్గరికి వెళ్లాలని తండ్రి కోరగా, ప్రసన్న నిరాకరించారు. దాంతో, తండ్రి ఇంట్లోనే ఆమె గొంతు పిసికి చంపారు. మరికొంతమంది సహాయంతో మృతదేహాన్ని కారులో గిద్దలూరు ఘాట్‌కు తీసుకొని వెళ్లి తల, మొండెం వేరు చేసి లోయలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి దేవేందర్ రెడ్డితో పాటు మరికొందని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments