Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి తర్వాత ప్రియుడితోనే కూతురు.. భర్త వద్దకు వెళ్లలేదు.. తండ్రి ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (11:43 IST)
ఆధునికత పెరుగుతున్నా.. పరువు హత్యలు ఏమాత్రం తగ్గట్లేదు. పెళ్లికి ముందు మరో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి.. పెళ్లి తర్వాత ఊరుకొచ్చి మళ్లీ తిరిగి వెళ్లలేదు. కుమార్తె ప్రవర్తనతో విసిపిపోయిన తండ్రి.. పరువు పోయిందని.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసి తలను మొండేన్ని వేరు చేశాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆలమూరుకు చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి ప్రసన్నకు హైదరాబాదుకు చెందిన టెక్కీతో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ప్రసన్న వేరొక వ్యక్తిని ప్రేమించింది. 
 
పెళ్లయ్యాక కూడా అతనిని మరిచిపోలేకపోయింది. పెళ్లయ్యాక గ్రామానికి వచ్చిన ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. దీంతో పరువు పోయిందని భావించిన ప్రసన్న తండ్రి ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని తీసుకెళ్లి నంద్యాల-గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. 
 
అక్కడ కుమార్తె మృతదేహం నుంచి తలను వేరు చేసి రెండింటిని వేర్వేరు చోట్ల పడేశారు. ఆపై ఏమీ తెలియనట్లు మిన్నకుండిపోయాడు. అయితే కుటుంబీకులు అతనిని నిలదీయడంతో నిజం చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసన్న తండ్రిని అరెస్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments