ఆడ తోడు కోసం 2 రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 5 నెలల పాటు తిరిగిన మగ పులి

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (15:17 IST)
ఆడ తోడు కోసం ఒక పులి అయిదు నెలల పాటు రెండు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల పరిధిలో 1300 కిలోమీటర్ల మేర తిరిగి రికార్డు సృష్టించింది. భారత దేశంలో ఇంకే పులీ ఇంతవరకు ఇంతలా తిరిగింది లేదని అటవీ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో మొదలైన ఆ మగ పులి యాత్ర పొరుగునే ఉన్న తెలంగాణలోనూ సాగింది. ఈ క్రమంలో అది అడవిలోనే కాదు సమీపంలోని పొలాలు, హైవేలు, ఊళ్లు మీదుగా ప్రయాణించింది.

 
రెండున్నరేళ్ల వయసున్న ఆ పులి సాగించిన సుదీర్ఘ యాత్రకు కారణం ఆహారం, ఆడతోడు కోసం వెతుకులాటేనని అటవీ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని ఒక అభయారణ్యంలోని ఈ పులికి గతంలోనే అధికారులు రేడియో కాలర్ అమర్చారు. రేడియో కాలర్ సహాయంతో దాని జాడను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

 
జూన్‌లో అది తానున్న అభయారణ్యాన్ని వీడి తిరగడం ప్రారంభించింది. అక్కడి నుంచి పొలాలు, నీరున్న ప్రాంతాలు, హైవేలపై అటూఇటూ తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలోకి కూడా వచ్చింది. మహారాష్ట్రలోని తిపేశ్వర్ పులుల అభయారణ్యంలో టీ-1 అనే ఆడ పులికి రెండున్నరేళ్ల కింద పుట్టిన మూడు కూనల్లో ఇదొకటి. దీని పేరు సీ-1.

 
ఫిబ్రవరిలో సీ-1కి అటవీ శాఖ సిబ్బంది రేడియో కాలర్ అమర్చారు. ఆ తరువాత నుంచి ఇది ఎటు వెళ్తుందన్నది ట్రాక్ చేస్తున్నారు. అయితే, జూన్ నుంచి ఇది అలుపు లేకుండా సంచరించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇది మహారాష్ట్ర, తెలంగాణల్లోని ఏడు జిల్లాల్లో తిరిగింది. రేడియో కాలర్ ద్వారా జీపీఎస్ శాటిలైట్ సమాచారాన్ని గంటగంటకూ తెలుసుకున్నామని గత 9 నెలల్లో ఆ పులి 5,000 వేర్వేరు ప్రాంతాల్లో సంచరించిందని చెప్పారు.

 
''ఆవాసం, ఆహారం, ఆడ తోడు కోసం సీ-1 అదే పనిగా సంచరించి ఉండొచ్చు. భారత్‌లో పులులుండే ప్రాంతాలన్నీ నిండిపోయాయి. కొత్త పులులు తనదైన పరిధి ఏర్పరచుకోవడానికి కొత్త ప్రాంతాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది'' అని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ బయాలజిస్ట్‌గా ఉన్న డాక్టర్ బిలాల్ హబీబ్ అన్నారు.

 
ఈ సుదీర్ఘ యాత్రలో సీ-1 పగటి పూట దాక్కుని రాత్రి వేళలో నడక సాగించేది. ఆహారం కోసం అడవి పందులు, పశువులను వేటాడేది. ఒక్కసారి తప్ప ఎన్నడూ మనుషులపై దాడి చేయలేదని, అది కూడా తాను విశ్రాంతి తీసుకుంటున్న గుబురు పొదలోకి చొరబడడం వల్ల అనుకోకుండా గాయపరిచిందని హబీబ్ చెప్పారు. ''ఈ పులి తమ పెరట్లో తిరిగినా చాలామందికి తెలియలేదు'' అంటూ హబీబ్ సీ-1 గురించి చెప్పారు.

 
అయినప్పటికీ సీ-1 వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా దాన్ని పట్టుకుని సమీపంలోని అడవిలోకి తరలిస్తామని అటవీ అధికారులు చెప్పారు. దానికి అమర్చిన రేడియో కాలర్‌ బ్యాటరీ 80 శాతం అయిపోవడంతో కొద్దిరోజుల్లో కమ్యూనికేషన్ తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందే దాన్ని పట్టుకుంటామని చెబుతున్నారు.

 
దేశంలో పులుల సంఖ్య పెరుగుతుండగా వాటి ఆవాసాలు తగ్గిపోతున్నాయి. ఒక పులి మనుగడ సాగించాలంటే అది ఉండే ప్రాంతంలో కనీసం 500 జంతువులతో ఆహార సంపద ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments