Webdunia - Bharat's app for daily news and videos

Install App

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్మశానంలో కోవిడ్ రోగుల ఐసొలేషన్

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (17:22 IST)
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు గ్రామస్థులు శ్మశానంలో ఐసొలేషన్లో ఉన్నారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది. కరోనా బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ కేంద్రాలకు వెళ్లడమో.. హోం ఐసొలేషన్‌లో ఉండటమో చేస్తుంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజన గ్రామం మొద్దులమడ వాసులు భిన్నంగా వ్యవహరించారు.

 
150 జనాభా ఉన్న ఈ గ్రామం లో 50 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇంటికొకరు వైరస్‌ బారినపడ్డారు. దీంతో తమ ద్వారా మిగతావారికి వ్యాపించకుండా ఉండేందుకు వైకుంఠధామం (శ్మశానం)ను ఐసొలేషన్‌ కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి వైకుంఠధామంలోనే ఉంటున్నారు. సామూహిక వంటలకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరికి అవసరమైన ఆహార సామగ్రిని ఊరి ప్రజలు సమకూర్చారని పత్రిక చెప్పింది.

 
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధువులూ కొంతసాయం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు బిర్రం వెంకటేశ్వరరావు నిత్యావసర వస్తువులను అందజేశారు. చిప్పల బాబు భోజనాలు పంపిస్తున్నారు. కాగా, మొద్దులమడలో కరోనా సోకినవారిని ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించి వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దీనికి వారు అంగీకరించడం లేదు. ఇక్కడే తమకు స్వేచ్ఛగా ఉందని చెబుతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments