Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (20:08 IST)
గర్భంతో ఉన్న ఆడవారు ముందు నుండి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇలా తీసుకోవటం వలన గర్భవతిగా వున్న సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కొనవచ్చు. తయారుచేసుకున్న ప్రణాళికలో కావలసిన పోషకాలను సరైన మోతాదులో ఉండేలా మరియు ఆహారాన్ని తగిన సమయంలో తీసుకోవాలి.
 
1. మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా క్యాల్షియం, ప్రోటీన్స్, ఐరన్, విటమిన్ సి మరియు ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆడవారు మాములుగా తీసుకునే దాని కంటే గర్భంతో ఉన్న సమయంలో ప్రతిరోజు 300 నుండి 400 క్యాలోరీలను ఎక్కువ తీసుకోవాలని ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన వైద్యులు అందరు తెలిపారు, ముఖ్యంగా ప్రసవానికి ముందుగా తప్పకుండా తీసుకోవాలి.
 
2. గర్భంతో ఉన్నవారు ముఖ్యంగా తీసుకోవలసిన ఇంకొక మూలకం మినరల్స్. గర్భ సమయంలో వారి శరీరం లోపల మరియు బయట వచ్చే మార్పులకు తట్టుకొని, ఆరోగ్యవంతమైన ప్రసవం జరగాలి అంటే మినరల్స్ తప్పనిసరిగా అవసరం. ఆక్సిజన్, పోషకాలను శరీర అన్ని భాగాలకు అందేలా చేసే ఎర్ర రక్తకణాల ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా మినరల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
 
3. మీరు తీసుకునే ఆహారంలో అవసరం మేరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్ మరియు సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. గర్భ సమయంలో వారి జీర్ణక్రియ శక్తి తగ్గిపోతుంది. కావున మీరు త్వరగా జీర్ణం కానీ ఆహారాన్ని తినటం వలన శరీరంలోని విసర్జక పదార్థాలు బయటికి పంపటంలో విఫలం అవటం వలన రక్తం చెడిపోయి ఇతరేతర ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. కావున త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి.
 
4. గర్భంతో ఉన్నవారు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, రోజు తీసుకునే ఆహారంలో పండ్లను తప్పకుండా తీసుకోవాలి.  ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను తినండి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు మరియు పాల పదార్థాలను తినాలి. మీ వైద్యుడిని సలహాలను పాటించి, కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోటానికి రోజు ఒక గ్లాసు అన్ని పండ్లు కలిపిన పండ్ల రసాన్ని తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

తర్వాతి కథనం
Show comments